'ఈగ 2' సీక్వెల్ తీయాలని కోరుకుంటున్న నాని
- September 28, 2016
నాని హీరోగా ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ డ్రామా 'ఈగ' చిత్రం 2012లో విడుదలై మంచి విజయం సాధించింది. ఓ అభిమానిగా ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటే బావుంటుందని నాని అభిప్రాయపడ్డారు. 'ఈ రోజుకీ 'ఈగ 2' గురించి వస్తున్న రిపోర్ట్స్ను చదువుతున్నా. అది నిజం కావాలని కోరుకుంటున్నా. ఇంకా ఈ ప్రాజెక్టు గురించి ఎటువంటి సమాచారం లేదు. రాజమౌళిని కలిసినప్పుడు.. సరదాగా ఈ సీక్వెల్ గురించి అడిగాను. 'ఈగ' అభిమానిగా దీనికి సీక్వెల్ కావాలని అనుకుంటున్నా. తొలి విభాగంలో నేను చనిపోయా.. టెక్నికల్గా రెండో విభాగంలో నా పాత్ర ఉండదు.
అయినప్పటికీ సీక్వెల్ తీయాలని కోరుకుంటున్నా. ఏదేమైనప్పటికీ.. 'ఈగ 2' తీయాలా, వద్దా అన్న నిర్ణయం పూర్తిగా రాజమౌళిదే. నేను ఆసక్తిగా దాని కోసం ఎదురుచూస్తున్నా' అని నాని అన్నారు.'ఈగ' చిత్రంలో సమంత కథానాయికగా నటించిన సంగతి తెలిసిందే. నాని ప్రస్తుతం 'పక్కా లోకల్' చిత్రం షూటింగ్లో ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన సరసన కీర్తీసురేశ్ నటిస్తున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







