"సిద్ధంగా ఉండండి" - సైన్యానికి పిలుపునిచ్చిన కేంద్రం..

- September 29, 2016 , by Maagulf

భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నవేళ భారత ప్రభుత్వం సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే తమ యూనిట్లకు చేరుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సరిహద్దు వెంబడి అదనపు బలగాలను మోహరించిన ఆర్మీ మరిన్ని బలగాలను మోహరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సైనికులకు సెలవులు రద్దు చేసింది. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆదేశాలు అందుకున్న సైనికులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమన్న సంకేతానికి గుర్తుని అని నిపుణులు పేర్కొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com