"సిద్ధంగా ఉండండి" - సైన్యానికి పిలుపునిచ్చిన కేంద్రం..
- September 29, 2016
భారత్, పాకిస్థాన్ మధ్య ప్రస్తుతం యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నవేళ భారత ప్రభుత్వం సైన్యానికి సెలవులు రద్దు చేసింది. పాకిస్థాన్ సరిహద్దు వెంబడి తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం వెంటనే తమ యూనిట్లకు చేరుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే సరిహద్దు వెంబడి అదనపు బలగాలను మోహరించిన ఆర్మీ మరిన్ని బలగాలను మోహరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు సైనికులకు సెలవులు రద్దు చేసింది. ఎటువంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించినట్టు తెలుస్తోంది. ఆదేశాలు అందుకున్న సైనికులు సమరోత్సాహంతో కదం తొక్కుతున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమన్న సంకేతానికి గుర్తుని అని నిపుణులు పేర్కొంటున్నారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







