కొత్త భవనాన్ని ప్రారంభించనున్న అబుదాబీ మలయాళ సమాజం

- September 30, 2016 , by Maagulf
కొత్త భవనాన్ని ప్రారంభించనున్న అబుదాబీ మలయాళ సమాజం

అబుదాబీ: అబుదాబీ మలయాళ సమాజం, కొత్తగా నిర్మించబడిన భవనాన్ని శుక్రవారం ప్రారంభిస్తోంది. అబుదాబీలో 1969లో అబుదాబీ మలయాళ సమాజం ప్రారంభమైంది. మినిస్టర్‌ ఆఫ్‌ కల్చర్‌ అండ్‌ నాలెడ్జ్‌ డెవలప్‌మెంట్‌ షేక్‌ నహ్యాన్‌ బిన్‌ ముబారక్‌ అల్‌ నహ్యాన్‌ ఈ కొత్త భవనాన్ని ప్రారంభిస్తారు. ముసాఫా ఇండస్ట్రియల్‌ ఏరియాలో ఈ భవనాన్ని నిర్మించినట్లు అబుదాబీ మలయాళ సమాజం ప్రెసిడెంట్‌ బి యెసుశీలన్‌ - తెలిపారు. 2000 మందికి పైగా ఈ ప్రారంభోత్సవానికి హాజరు కానున్నారని అంచనా వేస్తున్నారు. 1000 మందికి సరిపడా సౌండ్‌ ప్రూఫ్‌ ఆడియం ఇందులో ఓ ప్రత్యేకత. 250 మందికి సరిపడే మినీ ఆడిటోరియం కూడా ఇందులో ఉంటుంది. లైబ్రరీ, రీడింగ్‌ రూమ్‌, మీటింగ్‌ రూమ్‌, లేడీస్‌ వింగ్‌, రెండు బ్యాడ్మింటన్‌ కోర్టులు, పిల్లల కోసం ప్లే ఏరియా ఈ భవనంలో ఏర్పాటు చేశారు. 2 మిలియన్‌ దిర్హామ్‌ల ఖర్చుతో భవనాన్ని నిర్మించారు. ఇందులో మలయాళీలు తమ మాతృ భాష అయిన మలయాళంను ప్రమోట్‌ చేసేందుకు పలు కార్యక్రమాలను రూపొందించనున్నట్లు ప్రెసిడెంట్‌ యేసుశీలన్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com