మిల్కీబ్యూటీ తమన్నా వార్తల్లో హంగామా....
- September 30, 2016
మిల్కీబ్యూటీ తమన్నా వార్తల్లో హంగామా చేస్తోంది. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ ఆర్టిస్టుల అసోసియేషన్ నడిగర్ సంఘానికి ఫిర్యాదు కూడా చేశాడు ఓ ప్రొడ్యూసర్. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్ అంతటా హాట్టాపిక్ అయ్యింది. విజయ్ సేతుపతి హీరోగా 'ధర్మదురై' అనే చిత్రాన్ని నిర్మించాడు నిర్మాత ఆర్కే సురేశ్. హీరోయిన్ తమన్నా నటించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కాసులు రాబట్టింది. అయితే విడుదలకు ముందుగానీ, తర్వాత కానీ తమన్నా ప్రమోషన్లలో పాల్గొనలేదట.
ఇప్పుడు 'అభినేత్రి' ప్రమోషన్ల్లో తమన్నా హంగామా చేయడంపై సదరు ప్రొడ్యూసర్కి కోపం పుట్టుకొచ్చింది. దాంతో ఆ నిర్మాత నడిగర్ సంఘంలో ఈ బ్యూటీపై ఫిర్యాదు చేశాడు.దీనిపై విచారణ జరపాల్సిన నడిగర్ సంఘం సెక్రటరీ విశాల్తో తమన్నా 'కత్తి సందై' సినిమాలో నటిస్తోంది. మరి ఆ ఫిర్యాదుపై విచారణ ఎలా జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తమిళతంబీలు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







