15రోజుల పాటు ఓడరేవులో కీలకమైన భద్రతా
- September 30, 2016
: భారత సైన్యం పిఓకెలోని పాకిస్తాన్ మిలిటెంట్ల స్థావరాలపై మెరుపుదాడులు చేసి 38మంది ఉగ్రవాదులను హతమార్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని మెట్రో నగరాలతోపాటు ముఖ్య ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపధ్యంలో నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులో ఉన్నతాధికారులు మూడంచెల పటిష్ట భద్రతా చర్యలకు శ్రీకారం చుట్టారు. ఈమేరకు శుక్రవారం నుంచి దాదాపు 15రోజుల పాటు ఓడరేవులో కీలకమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ విషయాన్ని కృష్ణపట్నం పోర్టు సీనియర్ జనరల్ మేనేజర్ టి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అన్ని ప్రదేశాల్లో క్షుణ్ణంగా తనిఖీలు, తీరప్రాంత గస్తీని ముమ్మరం చేయడం, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భద్రతా అధికారులు నిరంతర పర్యవేక్షణ చేస్తుంటారని ప్రకటించారు.ఈ తనిఖీల్లో భాగంగా ఇండియన్ కోస్ట్ గార్డ్స్, కస్టమ్స్, మెరైన్ పోలీస్, స్థానిక పోలీస్యంత్రాంగంతోపాటు పోర్టు సెక్యూరిటీ బృందం ప్రధాన పాత్ర నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. ఓడరేవు సందర్శనను తాత్కాలికంగా రద్దు చేశామన్నారు. వివిధ పనులపై ఓడరేవుకు వచ్చేవారిని కార్మికులు, ఉద్యోగులు స్థానికులు ఎవరైనా గుర్తింపుకార్డులు తమ వెంట తెచ్చుకోవాలని ఆయన పేర్కొన్నారు. ఓడరేవు పరిసర ప్రాంతాల ప్రజలు ఓడరేవు సిబ్బందికి సహకరించాలని పోర్ట్ సెక్యూరిటీ ఎజిఎం మనోహర్బాబు కోరారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









