ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ..

- September 30, 2016 , by Maagulf
ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ..

ఆంధ్రప్రదేశ్లోని ఏడు జిల్లాలకు పన్ను రాయితీ కల్పిస్తూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పన్ను రాయితీలు 2015 నుంచి 2020 మార్చి వరకూ వర్తిస్తాయి. ఉత్తరాంధ్రలో మూడు జిల్లాలు, రాయలసీమలోని నాలుగు జిల్లాలకు పన్ను రాయితీ వర్తించింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు పన్ను రాయితీలు వర్తించనున్నాయి. ఇటీవల కేంద్రం ఏపీకి ప్రత్యేక సాయం ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణ జిల్లాలకు సైతం పన్ను రాయితీ ప్రకటించాలని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ కోరారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com