సరైన సమయంలో వేతనాల కోసం కొత్త చట్టం
- October 03, 2016
క్టోబర్ 3 నుంచి అమల్లోకి రానున్న కొత్త చట్టం ద్వారా యూఏఈలోని కార్మికులు సకాలంలో వేతనాలు అందేందుకు మార్గం సుగమం అవుతుంది. మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్ సక్ర్ బిన్ ఘోబాష్ సయీద్ ఘోబాష్ జారీ చేసిన డిక్రీ ద్వారా, 100కి పైగా కార్మికులు గల కంపెనీలు రిజిస్టర్ పే సమయానికి 10 రోజుల్లోపే వేతనాల్ని పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది. లేని పక్షంలో 16వ రోజు నుంచీ, ఆ కంపెనీ కొత్తగా ఎవరికీ వర్క్ పర్మిట్లు జారీ చేయకుండా నిషేధం విధిస్తుంది. లేబర్ మార్కెట్ని స్టేబిలైజ్ చేయడానికి వీలుగా ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చినట్లు మినిస్ట్రీ అండర్ సెక్రెటరీ ఫర్ ఇన్స్పెక్షన్స్ మెహెర్ అల్ ఒబెద్ చెప్పారు. ప్రధానంగా జీతాల సమస్యను నిరోధించే దిశగా ఈ చట్టం వీలు కల్పిస్తుందని ఆయన వివరించారు. నెల రోజులపాటు గనుక వేతనాలు చెల్లించని పక్షంలో, సదరు సంస్థ గురించి మినిస్ట్రీ జ్యుడీషియరీకి రిఫర్ చేస్తుంది. తదనంతరం అవసరమైన చర్యల్ని తీసుకుంటుంది. 60 రోజులపాటు జీతాలు చెల్లించకపోతే, కఠినంగా జరీమానాల్ని విధిస్తారు. ఒక్కో వర్కర్కీ 5,000 దిర్హామ్ల చొప్పున కంపెనీకి జరీమానా విధించడం జరుగుతుంది. 100 మంది లోపు కార్మికులకు మాత్రం ఇదివరకు ఉన్న నిబంధనలే అమల్లో ఉంటాయి.
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









