ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు మంతనాలు
- October 03, 2016
భారత్, పాక్ మధ్య మూడు వారాలుగా ద్వైపాక్షిక ఉద్రికతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తలను తొలగించేందుకు ప్రయత్నించాలని ఉభయులూ అంగీకరించినట్టు పాకిస్తాన్ జియో టీవీ సోమవారంనాడు తెలిపింది. అజిత్ దోవల్, పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ మధ్య సంభాషణలు జరిగినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీప్ సలహాదారు సర్తాజ్ అజిజ్ ధ్రువీకరించారని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు కశ్మీర్ అంశంపై మరింత దృష్టి సారించాలని కూడా పాక్ కోరుకుంటున్నట్టు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారని డాన్ పత్రిక తెలిపింది.'కశ్మీర్ అంశం పరిష్కారం కానంతవరకూ సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉంటాయని ఇటీవల అమెరికా పర్యటనలో నవాజ్ షరీఫ్ ప్రపంచదేశాలకు చెప్పడం కూడా జరిగింది' అని సర్తాజ్ అజిజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







