ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు మంతనాలు
- October 03, 2016
భారత్, పాక్ మధ్య మూడు వారాలుగా ద్వైపాక్షిక ఉద్రికతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తలను తొలగించేందుకు ప్రయత్నించాలని ఉభయులూ అంగీకరించినట్టు పాకిస్తాన్ జియో టీవీ సోమవారంనాడు తెలిపింది. అజిత్ దోవల్, పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ మధ్య సంభాషణలు జరిగినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీప్ సలహాదారు సర్తాజ్ అజిజ్ ధ్రువీకరించారని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు కశ్మీర్ అంశంపై మరింత దృష్టి సారించాలని కూడా పాక్ కోరుకుంటున్నట్టు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారని డాన్ పత్రిక తెలిపింది.'కశ్మీర్ అంశం పరిష్కారం కానంతవరకూ సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉంటాయని ఇటీవల అమెరికా పర్యటనలో నవాజ్ షరీఫ్ ప్రపంచదేశాలకు చెప్పడం కూడా జరిగింది' అని సర్తాజ్ అజిజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు
తాజా వార్తలు
- విద్యే సాధికారతకు మూలం: గవర్నర్
- దుబాయ్ మెరినా టవర్ పై డ్రోన్ అవశేషాలు పడిన ఘటన
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!









