ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు మంతనాలు

- October 03, 2016 , by Maagulf
ఉద్రిక్తతలు తగ్గించేందుకు ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు మంతనాలు

భారత్, పాక్ మధ్య మూడు వారాలుగా ద్వైపాక్షిక ఉద్రికతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల జాతీయ భద్రతా సలహాదారులు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తలను తొలగించేందుకు ప్రయత్నించాలని ఉభయులూ అంగీకరించినట్టు పాకిస్తాన్ జియో టీవీ సోమవారంనాడు తెలిపింది. అజిత్ దోవల్, పాక్ జాతీయ భద్రతా సలహాదారు నసీర్ ఖాన్ మధ్య సంభాషణలు జరిగినట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీప్ సలహాదారు సర్తాజ్ అజిజ్ ధ్రువీకరించారని పేర్కొంది. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలను తగ్గించడంతో పాటు కశ్మీర్ అంశంపై మరింత దృష్టి సారించాలని కూడా పాక్ కోరుకుంటున్నట్టు సర్తాజ్ అజీజ్ పేర్కొన్నారని డాన్ పత్రిక తెలిపింది.'కశ్మీర్ అంశం పరిష్కారం కానంతవరకూ సరిహద్దుల్లో ఉద్రిక్తలు కొనసాగుతూనే ఉంటాయని ఇటీవల అమెరికా పర్యటనలో నవాజ్ షరీఫ్ ప్రపంచదేశాలకు చెప్పడం కూడా జరిగింది' అని సర్తాజ్ అజిజ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com