పోలీసులను ఆశ్రయించిన బాలుడు...

- October 03, 2016 , by Maagulf
పోలీసులను ఆశ్రయించిన బాలుడు...

సౌదీ అరేబియాలోని రియాద్‌ నగరంలో ఉన్న తన అమ్మ షేక్‌ షాహీన్, తండ్రి షేక్‌ ఖాదర్‌బాషాలను రక్షించాలని కొక్కంటి క్రాస్‌కు చెందిన షేక్‌ ఫైరోజ్‌ తనకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన తల్లిదండ్రులను కదిరికి చెందిన బోకర్లు హిదాయ తుల్లా, అయూబ్‌లు సౌదీ అరేబియాకు పంపినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సౌదీ అరేబియాలోని సేఠ్‌ నుంచి మూడు లక్షలు రూపాయలు తెచ్చుకున్న బ్రోకర్లు తన అమ్మ, నాన్నలను అక్కడికి పంపారన్నారు.సంవత్సరాలు తరబడి పని చేస్తున్నా సేఠ్‌ ఒక్క పైసా కూడా తన తల్లిదండ్రులకు ఇవ్వలేదని వివరించారు. తన తల్లి ఆరోగ్యం క్షీణించినట్టు ఫోన్‌లో సమాచారం ఇచ్చిందని తెలిపాడు. మా యమాటలు చెప్పి సౌదీకి పంపి మోసగిం చిన బ్రోకర్లును శిక్షించాలని కోరారు. బ్రోకర్లపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com