మహిళపై వ్యభిచారం ఆరోపణలు - ఇద్దరికి జైలు శిక్ష
- October 03, 2016
జెడ్డా: ఇద్దరు వ్యక్తులు, ఓ మహిళపై అకారణంగా వ్యభిచారం ఆరోపణలు చేసినందుకుగాను క్రిమినల్ కోర్ట్ జడ్జ్ ఆ ఇద్దరికీ 80 రోజులపాటు జైలు శిక్ష విధించారు. కేసు వివరాల్లోకి వెళితే, తన భార్య నుంచి తన పిల్లల్ని వేరు చేసి, తనకు అప్పగించాల్సిందిగా ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా, ఆ వ్యక్తి తన భార్య వ్యభిచారం చేస్తోందని ఆరోపించాడు. అయితే ఆ వ్యక్తి చెప్పిన మాటల్ని ప్రాసిక్యూటర్ విశ్వసించలేదు. ఆయన చూపిన ఆధారాలు సైతం అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇంకో వైపున బాధితురాలి తరఫు లాయర్, తన క్లయింట్ తరఫున వాదనల్ని వినిపించారు. అయితే ఆధారాల్ని చూపే క్రమంలో ఆ భర్త ఇద్దరు వ్యక్తులతో సాక్ష్యాలు ఇప్పించగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు. మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చేలా, వారిపై అభాండాలు మోపాలనుకునేవారికి ఈ తీర్పు చెంపదెబ్బ లాంటిదని బాధితుఆలి తరఫు లాయర్ బాదర్ అల్ షాత్రి చెప్పారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







