మధ్యప్రదేశ్ చోటుచేసుకున్న విషాదం
- October 03, 2016
మధ్యప్రదేశ్లో ఓ స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. రాయ్సెన్ జిల్లాలోని సిల్వానిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుకుల విద్యాలయకు చెందిన స్కూలు బస్సు సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులను ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు సాయంత్రం బయలుదేరింది. ఈ క్రమంలో సిల్వాని వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన విద్యార్థులను సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









