మధ్యప్రదేశ్ చోటుచేసుకున్న విషాదం

- October 03, 2016 , by Maagulf
మధ్యప్రదేశ్ చోటుచేసుకున్న విషాదం

మధ్యప్రదేశ్‌లో ఓ స్కూలు బస్సు బోల్తా పడిన ఘటనలో 26 మంది విద్యార్థులు గాయపడ్డారు. రాయ్‌సెన్ జిల్లాలోని సిల్వానిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గురుకుల విద్యాలయకు చెందిన స్కూలు బస్సు సమీప గ్రామాలకు చెందిన విద్యార్థులను ఇంటి వద్ద వదిలిపెట్టేందుకు సాయంత్రం బయలుదేరింది. ఈ క్రమంలో సిల్వాని వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఒక్కసారిగా బోల్తాపడింది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన విద్యార్థులను సమీపంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com