భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న 'జాగ్వర్'
- October 04, 2016
సినిమా ఎంత ఖర్చు పెట్టి తీసిన దానికి తగట్టే ప్రమోషన్ చేయకపోతే ఎంత పెద్ద సినిమా అయినా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవడం చాల కష్టం..అందుకే ఈరోజుల్లో ఎంత పెద్ద స్టార్ అయినా కానీ తమ సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు..అలాంటిది తమ సినిమాను 75 కోట్లు ఖర్చు పెట్టి తీసాం చూడండి అంటే సినీ జనాలు చూస్తారా..అనేది సాధారణ ప్రేక్షకుడి ప్రశ్న.
మాజీ ప్రధాని దేవెగౌడ మనవడు , మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు అయిన నిఖిల్ కుమార్ గౌడ హీరోగా మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన జాగ్వార్ చిత్రం దసరా కానుకగా తెలుగు , కన్నడ భాషలలో ఈ నెల 6 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..దాదాపు 75 కోట్ల భారీ వ్యయం తో ఈ సినిమాను తెరకెక్కించాం అని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది..కానీ మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్ అవుతున్న కానీ ఎక్కడ ఈ చిత్రం గురించి మాట్లాడుకునే వారు కానీ , కనీసం సినిమా ప్రమోషన్ కూడా ఎక్కడ కనిపించకపోవడం తో ఈ సినిమా చూడడానికి ఎవరు ముందుకొస్తారు అంటున్నారు ప్రేక్షకులు..75 కోట్లు పెట్టి సినిమా తీయడం కాదు దానికి తగట్టే ప్రమోషన్స్ చేయాలంటున్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







