పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే పిటిషన్ పై 6,65,769 సంతకాలు ,...
- October 04, 2016
పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండు నేపథ్యంలో వైట్ హౌస్ అధికారులు చేపట్టిన ఆన్ లైన్ పిటిషన్ దరఖాస్తుకు రికార్డు స్థాయిలో మద్దతు లభిస్తోంది. ఇప్పటి వరకు 6,65,769 మంది ఈ పిటిషన్ పై సంతకాలు చేశారని వైట్ హౌస్ ప్రకటించింది. నిన్న ఒక్క రోజే రికార్డు స్థాయిలో 50 వేల మంది సంతకాలు చేశారు. ఇప్పటి వరకు వైట్ హౌస్ చేపట్టిన సంతకాల సేకరణలో 3,50,000 మంది సంతకాలు చేయడమే రికార్డుగా ఉంది. ఆ రికార్డును ఈ పిటిషన్ బద్దలు కొట్టింది. దీంతో తలలు పట్టుకున్న వైట్ హౌస్ అధికారులు పిటిషన్ ను రద్దు చేశారు.పాకిస్థాన్ ను ఉగ్రదేశంగా ప్రకటించాలనే డిమాండ్ నేపథ్యంలో సెప్టెంబర్ 21న ఈ పిటిషన్ ను వైట్ హౌస్ అధికారిక వెబ్ సైట్ లో చేర్చారు.
30 రోజుల్లో లక్ష సంతకాలు వస్తే అమెరికా అధ్యక్షుడు 60 రోజుల్లో స్పందించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఆన్ లైన్ పిటిషన్లలోని 98 శాతం పిటిషన్లపై అధ్యక్షులు స్పందించారు. దీంతో 'పాకిస్థాన్ ఉగ్రదేశం' పిటిషన్ పై ఆసక్తి నెలకొంది. అమెరికాలో ఉన్న బలూచిస్థాన్ ప్రజలు సైతం తమను పాకిస్థాన్ నుంచి వేరు చేయాలనే డిమాండ్ తో ఒక పిటిషన్ ను వైట్ హౌస్ వెబ్ సైట్ లో సంతకాల సేకరణ చేపట్టాని డిమాండ్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







