జాహ్నవి సినిమా చేయనుందని టాక్

- October 05, 2016 , by Maagulf
జాహ్నవి సినిమా చేయనుందని టాక్

టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి టాప్ హీరోల తో అటు బాలీవుడ్,ఇటు టాలీవుడ్ మాలీవుడ్,కోలీవుడ్ ల తెర పై నటిగా అందాల విందు చేసిన శ్రీదేవి బోనీకపూర్ తో మ్యారేజి అయిన తరువాత బాలీవుడ్ లో సెటిలైపోయింది.తెలుగు ఇండస్ట్రీలో అతిలోకసుందరి గా పేరు తెచ్చుకున్న శ్రీదేవి తర్వాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడే స్థిరపడిపోయింది. శ్రీదేవి తరువాత తెలుగు తెర మీద అంత ఫేం సంపాదించుకున్న వాళ్లెవరూ లేరనే చెప్పాలి.బోని కపూర్ తో వివాహం అయిన తరువాత శ్రీదేవికి జాహ్నవి,ఖుషి అనే ఇద్దరు కూతుళ్ళున్నారు. కొంత కాలంగా శ్రీదేవి పెద్ద కూతురు జాహ్నవి సినిమాల్లోకి రాబోతుందంటూ వార్తలొచ్చినా ఇప్పటిదాకా అదిగో.. ఇదిగో అనే పుకార్లే తప్ప..ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్ ప్రొడ్యూసర్,డైరెక్టర్ కరణ్ జోహార్ నేతృత్వంలో వరుణ్ ధావన్ కు జంటగా.. జాహ్నవి సినిమా చేయనుందని టాక్.అయితే శ్రీదేవి ఫ్యామిలీ మాత్రం ఈ విషయాన్ని కన్ ఫాం చేయలేదు. సినిమాల్లో ఎంట్రీ గురించి ఆల్రెడీ సెన్సేషన్ క్రియేట్ చేపిన జూనియర్ జగదేక సుందరి జాహ్నవి రేపు ఫిల్మీవరల్డ్ లో అడుగు పెడితే ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనంటూ సినీపెద్దలు లెక్కలేస్తున్నారట.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com