భారత వెబ్‌సైట్లను హ్యాక్‌ చేస్తున్న పాక్‌ హ్యాకర్లు..

- October 05, 2016 , by Maagulf
భారత వెబ్‌సైట్లను హ్యాక్‌ చేస్తున్న  పాక్‌ హ్యాకర్లు..

ఏడు వేలకు పైగా భారత వెబ్‌సైట్లను హ్యాక్‌ చేయడమే కాక, ఆ సైట్ల వివరాలను మంగళవారం విడుదల చేసి ఇవే కాదు, ఇంకా చేస్తాం అని హెచ్చరించారు పాక్‌ హ్యాకర్లు. అయితే హ్యాక్‌ చేసినవారు నిపుణులు కారని సైబర్‌ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు. హ్యాకైన వెబ్‌సైట్లలో హిందీ పాటలు, హ్యాకర్ల లోగోలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. హ్యాకర్లు గతంలోనూ టాటా మోటర్స్‌, ఏఐఏడీఎంకే, తాజ్‌మహల్‌ వెబ్‌సైట్లను హ్యాక్‌ చేశారు. ఇప్పుడు హ్యాకైన వెబ్‌సైట్లలో ఎక్కువగా సాధారణ వెబ్‌సైట్లేనని దీనిని బట్టి చూస్తే భారత వెబ్‌సైట్లు హ్యాకింక్‌కు ఎంతవీలుగా ఉన్నాయో తెలుస్తోందని నిపుణులు అన్నారు.జనవరి 2010 నుంచి డిసెంబరు 2015 వరకు 1,490 ప్రభుత్వ వెబ్‌సైట్లు హ్యాకయ్యాయని ఐటీ మంత్రిత్వ శాఖ ఓ నివేదికలో వెల్లడించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com