బహ్రెయినీలను టార్గెట్ చేస్తున్న ఆన్లైన్ స్కామర్స్
- October 05, 2016
ఆన్లైన్ వేదికగా మోసాలు పెరిగిపోతున్నాయి. బహ్రెయినీ యువతకు ఆన్లైన్ స్కామర్స్ గాలం వేస్తూ వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారు. గత కొద్ది నెలలుగా ఈ తరహా మోసాలు ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ప్రధానంగా బహ్రెయినీ యువత ఈ మోసాలకు గురవుతున్నారు. ఆన్లైన్ ద్వారా వర్క్ ఎట్ హోమ్ ఆఫర్స్తో ఈ మోసాలు మొదలవుతున్నాయి. రోజుకి 91 బహ్రెయినీ దినార్స్ ఇస్తామని చెబుతూ స్కామర్స్ సోషల్ మీడియా ద్వారా యువతని ఆకట్టుకుంటున్నారు. ఈ పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం కొంత మొత్తం ముందుగా చెల్లించాలని డిమాండ్ చేయడం, అమాయకులు వారు అడిగిన సొమ్ములు చెల్లించడం, ఆ తర్వాత స్కామర్స్ పత్తా లేకుండా పోవడం జరుగుతోంది. ఫేక్ జాబ్ ఆఫర్స్కి స్పందించకపోవడం, అలాంటి ఆఫర్స్ వచ్చినప్పుడు వాటిపై పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా వాటి నుంచి తప్పించుకోవచ్చని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆన్లైన్ స్కామర్స్ మోసాల కారణంగా ఎంతోమంది యువత తమ జీవితాల్ని నాశనం చేసుకున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







