బెల్ట్ బాంబులు పేలి 16 మంది ఉగ్రవాదులు మృతి
- October 06, 2016
ఉగ్రవాదులు దారుణమారణకాండకు లక్ష్యాలను ఎంచుకుని ఆత్మాహుతి దాడులు చేసుకుంటూ ఉంటారు. వారు చస్తూ అమాయకప్రజల్ని చంపుతారు. అయితే ఈ సంఘటనలో మాత్రం వారి పరిస్థితి తాము తీసుకున్న గోతిలో తామే పడ్డట్టు అయింది. బెల్టుకు కట్టి ఉన్న బాంబులు పొరపాటున పేలిపోవడంతో 16మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఇరాక్లోని హవిజా జిల్లాలో ఐసిస్ ఉగ్రవాదులు సమావేశం జరుగుతుండగా ఉన్నట్టుండి బెల్టు బాంబులు పేలిపోయాయి. దాంతో ఐసిస్ సీనియర్ నేతతో పాటు 16 మంది ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడినట్లు అల్ సుమారియా అనే ఇరాకీ టీవీ ఛానెల్ వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







