నేటి నుంచి యు.ఏ.ఈ లో పర్యటించనున్న భారత్ ప్రధాని మోదీ
- August 15, 2015
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యు.ఏ.ఈ)లో రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం అబుదాబీకి చేరుకోనున్నారు. ఈ పర్యటన సందర్భంగా మోదీ యుఎఇ నేతలతో వివిధ అంశాలపై చర్చలు జరపడంతో పాటు ఆ దేశ జనాభాలో దాదాపు 30 శాతంగా ఉన్న భారతీయులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. యుఎఇలో భారత ప్రధాన మంత్రి పర్యటించడం 34 ఏళ్లలో ఇదే తొలిసారి. అంతకుముందు దివంగత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ 1981లో యుఎఇలో పర్యటించారు. ఇంధన, వాణిజ్య రంగాల్లో సహకారాన్ని పెంపొందించాలని ఈ పర్యటన సందర్భంగా యుఎఇ పాలకులకు విజ్ఞప్తి చేయనున్న మోదీ, భారత్లో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆ దేశ పారిశ్రామికవేత్తలను కోరనున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







