వలసదారులను రక్షించిన స్పెయిన్ దళాలు
- October 09, 2016
ఐరోపాకు వెళ్లేందుకుగాను మధ్యధరా సముద్రంలో ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తున్న 104 మంది ఆఫ్రికా వలసదారులను స్పెయిన్ సముద్ర రక్షక దళాలు ఆదివారం రక్షించాయి. స్పెయిన్ ద్వీపమైన అల్బోరన్కు ఈశాన్య ప్రాంతంలో వలసదారుల పడవను గుర్తించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. పడవలో వారంతా ప్రమాదకర రీతిలోప్రయాణిస్తుండటంతో.. వారిని తీరానికి సురక్షితంగా చేర్చినట్లు తెలిపాయి. వలసదారుల్లో పలువురు చిన్నారులు, మహిళలు ఉన్నట్లు పేర్కొన్నాయి.2014 నుంచి ఇప్పటివరకు మధ్యధరా సముద్రంలో 10 వేలమందికి పైగా వలసదారులు పడవ ప్రమాదాల్లో దుర్మరణం పాలైన సంగతి గమనార్హం.
తాజా వార్తలు
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!
- ప్రవాసుల బ్యాంకు ఖాతాలపై కువైట్ పర్యవేక్షణ కఠినతరం..!!
- ఇండియన్ స్కూల్ బహ్రెయిన్ పై పేరెంట్స్ ప్యానెల్ విమర్శలు..!!









