సంప్రదాయ పాస్వర్డ్లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది!
- October 09, 2016
సంప్రదాయ పాస్వర్డ్లకు కాలం చెల్లినట్టే కనిపిస్తోంది! బయోమెట్రిక్, రెటినా లాంటి అధునాతన భద్రతా అంచెలనూ తలదన్నెలా.. సరికొత్త వ్యవస్థను పరిశోధకులు తెరపైకి తీసుకొచ్చారు. మెదడు తరంగాలతో వ్యక్తులను గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేశారు. మెదడులోని చర్యలను నమోదుచేసే, పర్యవేక్షించే ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రఫీ (ఈఈజీ) ఆధారంగా ఇది పనిచేస్తుంది. ఈ తరహా భద్రతా వ్యవస్థపై సైబర్ ముఠాలు దాడిచేసే అవకాశం చాలా తక్కువని దీన్ని అభివృద్ధిచేసిన టెక్సాస్ టెక్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. దీంతో అనుసంధానించిన కంప్యూటర్పై మనం పని చేస్తున్నప్పుడు.. ఈఈజీలు నిరంతరంగా మన మెదడులోని తరంగాలను నమోదు చేస్తుంటాయి.అత్యవసర సమయాల్లో మనం పక్కకు వెళ్లినప్పుడు ఎవరైనా మన కంప్యూటర్ను ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తే.. వెంటనే లాక్ పడిపోతుంది. స్వచలితంగా తెరచుకునే తలుపులు, వెలిగే లైట్లు, ఫేన్లు తదితర విద్యుత్తు పరికరాలతోపాటు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) సాంకేతికతలోనూ ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించే అవకాశముంది.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







