10 మంది పోలీసులు మృతి, 14 మందికి గాయాలు..

- October 10, 2016 , by Maagulf
10 మంది పోలీసులు మృతి, 14 మందికి గాయాలు..

అఫ్ఘనిస్తాన్‌ హెల్మాండ్‌ ప్రావిన్స్‌లో సోమవారం కారుబాంబు పేలుడు సంభవించింది. పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపిన వివరాల ప్రకారం... ఈ ఘటనలో 10 మంది పోలీసులు మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. బాంబు పేలుడు జరిగిన ప్రాంతాన్ని సైనిక ఉన్నతాధికారులు సందర్శించారు. క్షతగాత్రులను పరామర్శించారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తున్నట్టు ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటించలేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com