అబుదాబిలో 2017 నాటికి పూర్తికానున్న హిందూ దేవాలయం
- October 11, 2016అబుదాబిలో హిందువుల కోసం మొట్టమొదటగా ఓ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 2017నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది. యూఏఈలో అబుదాబిలో ప్రభుత్వం ఈ గుడి నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని వితరణగా ఇచ్చింది. ప్రస్తుతం అక్కడి హిందువులు పూజలు చేసుకోవాలంటే దుబాయ్ వరకూ ప్రయాణించాల్సి వస్తోంది. వేలాది మంది హిందువులు నివసిస్తున్న అబుదాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటించిన సందర్భంలో ఈ గుడి నిర్మాణం తెరమీదకొచ్చింది. ఈ విషయమై భారత్కు చెందిన వ్యాపారవేత్త బీఆర్ శెట్టి మాట్లాడుతూ 'దేవాలయ నిర్మాణానికి సహకరించి యూఏఈ మత సహనానికి గొప్ప చిరునామాగా నిలిచిందన్నారు. అందువల్లే ఇక్కడ అన్ని దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని' పేర్కొన్నారు.
అబుదాబి నగరం వెలుపల ఆల్ వాత్బాలో 20,000 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అబుదాబిలో భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం 26లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవనం సాగిస్తున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు