అబుదాబిలో 2017 నాటికి పూర్తికానున్న హిందూ దేవాలయం

- October 11, 2016 , by Maagulf
అబుదాబిలో 2017 నాటికి పూర్తికానున్న హిందూ దేవాలయం

అబుదాబిలో హిందువుల కోసం మొట్టమొదటగా ఓ దేవాలయాన్ని నిర్మిస్తున్నారు. 2017నాటికి ఈ నిర్మాణం పూర్తికానుంది. యూఏఈలో అబుదాబిలో ప్రభుత్వం ఈ గుడి నిర్మాణానికి కావల్సిన స్థలాన్ని వితరణగా ఇచ్చింది. ప్రస్తుతం అక్కడి హిందువులు పూజలు చేసుకోవాలంటే దుబాయ్‌ వరకూ ప్రయాణించాల్సి వస్తోంది. వేలాది మంది హిందువులు నివసిస్తున్న అబుదాబిలో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యటించిన సందర్భంలో ఈ గుడి నిర్మాణం తెరమీదకొచ్చింది. ఈ విషయమై భారత్‌కు చెందిన వ్యాపారవేత్త బీఆర్‌ శెట్టి మాట్లాడుతూ 'దేవాలయ నిర్మాణానికి సహకరించి యూఏఈ మత సహనానికి గొప్ప చిరునామాగా నిలిచిందన్నారు. అందువల్లే ఇక్కడ అన్ని దేశాల ప్రజలు ప్రశాంతంగా జీవించగలుగుతున్నారని' పేర్కొన్నారు.

అబుదాబి నగరం వెలుపల ఆల్‌ వాత్బాలో 20,000 చదరపు మీటర్ల స్థలాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. అబుదాబిలో భారత రాయబార కార్యాలయం లెక్కల ప్రకారం 26లక్షల మంది భారతీయులు యూఏఈలో జీవనం సాగిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com