ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్న పన్నీర్ సెల్వం
- October 11, 2016
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నమ్మినబంటుగా ఉన్న ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు అమ్మ శాఖలన్నీ అప్పగించారు. కాగా ఇది వరకే ఈయన ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రిగా అమ్మ కేబినెట్లో ఉన్నారు. అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. దీంతో అమ్మ శాఖలన్నీ పన్నీరు సెల్వంకే అప్పగించారు. ఆర్థిక మంత్రికే అమ్మ శాఖలన్నీ అప్పగిస్తూ రాజ్భవన్ నుంచి కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్టికల్ 166 ప్రకారం కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్ సెల్వంకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జయలలిత సూచన మేరకే ఆర్థిక మంత్రికి శాఖలు అప్పగించామని రాజ్ భవన్ ఉత్తర్వులో పేర్కొంది.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









