ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్న పన్నీర్ సెల్వం
- October 11, 2016తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు నమ్మినబంటుగా ఉన్న ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంకు అమ్మ శాఖలన్నీ అప్పగించారు. కాగా ఇది వరకే ఈయన ముఖ్యమంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన ఆర్థిక మంత్రిగా అమ్మ కేబినెట్లో ఉన్నారు. అమ్మ తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం విధితమే. దీంతో అమ్మ శాఖలన్నీ పన్నీరు సెల్వంకే అప్పగించారు. ఆర్థిక మంత్రికే అమ్మ శాఖలన్నీ అప్పగిస్తూ రాజ్భవన్ నుంచి కొద్ది సేపటి క్రితం ఉత్తర్వులు జారీ అయ్యాయి. అర్టికల్ 166 ప్రకారం కేబినెట్ సమావేశాలు నిర్వహించేందుకు పన్నీర్ సెల్వంకు అధికారాలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జయలలిత సూచన మేరకే ఆర్థిక మంత్రికి శాఖలు అప్పగించామని రాజ్ భవన్ ఉత్తర్వులో పేర్కొంది.
తాజా వార్తలు
- యూఏఈ లో స్వల్ప భూకంపం
- కొత్త సీపోర్ట్, సైడ్ వాక్..ప్రతిపాదనకు ఆమోదం
- నకిలీ కంపెనీలపై యాత్రికులకు హెచ్చరిక జారీ
- నిజ్వాలో రోడ్డు ప్రమాదం..ముగ్గురు ప్రవాస నర్సులు మృతి
- ఉక్రేనియన్ కు $3 మిలియన్లు..ఖతార్
- యూఏఈలోని ఒమానీ పౌరులకు శుభవార్త..!
- తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 రెడీ..
- తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు
- హైదారాబాద్ చేరుకున్న ఉపరాష్ట్రపతి..స్వాగతం పలికిన మంత్రి పొన్నం
- ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం..మంటల్లో చిక్కుకున్న దాదాపు 50 మంది కార్మికులు