చారిత్రక మసీదుల అభివద్ధికి కింగ్ ఓకే
- October 12, 2016
మదీనాలోని చారిత్రక మసీదుల్ని పునరుద్ధరించేందుకు, అభివృద్ధి చేసేందుకు రూపొందించిన ప్లాన్కి కింగ్ సల్మాన్ ఆమోద ముద్ర వేశారని ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్ వెల్లడించారు. సౌదీ కమిషన్ ఫర్ టూరిజం మరియు నేషనల్ హెరిటేజ్ (ఎస్సిటిఎన్హెచ్) ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు ప్రిన్స్ సుల్తాన్ బిన్ సల్మాన్. చారిత్రక మసీదుల్ని రినోవేట్ చేసేందుకుగాను ఫండ్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్స్ సుల్తాన్ ప్రకటించారు. ఈ క్రమంలో ప్రతి పౌరుడూ తమతో కలిసి పనిచేయాల్సిందిగా పిలుపునిచ్చారాయన. అర్బన్ హెరిటేజ్ సెంటర్లో భాగంగా చారిత్రక మసీదుల్ని పరిరక్షించుకోవాల్సి ఉందని ఆయన వివరించారు. ఓల్డ్ జెడ్డాలోని ఓత్మాన్ బిన్ అఫ్ఫాన్ చారిత్రక మసీదు సహా పలు ముఖ్యమైన మసీదుల పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నామని, చారిత్రక సంపదను కాపాడుకున్నప్పుడే భవిష్యత్ తరాలకి వాటి వైభవం గురించి చాటి చెప్పడానికి వీలవుతుందని ప్రిన్స్ సుల్తాన్ చెప్పారు. ఈ మేరకు నిర్వహించిన వర్క్ షాప్లో పెద్ద సంఖ్యలో డొనేషన్లు మసీదుల డెవలప్మెంట్ పండ్ కోసం అందాయి.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







