ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమం... పల్లె రఘునాథ్రెడ్డి,,
- October 12, 2016
ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు. వారిని త్వరలో దేశానికి తీసుకువస్తామని బుధవారం అనంతపురంలో ఆయన మీడియాకు చెప్పారు. ఇథియోపియాలోని మడమాల విశ్వవిద్యాలయంలో రాష్ర్టానికి చెందిన తెలుగు ప్రొఫెసర్లు చాలామంది నిర్బంధంలో ఉన్నారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వెంటనే స్పందించిందన్నారు. రాష్ట్ర యంత్రాంగం విదేశ వ్యవహారాల మంత్రితో ఫోన్లో మాట్లాడిందని, అంతేకాకుండా ఆ దేశ ఎంబసీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నదని వెల్లడించారు.ఆ దేశ విద్యా శాఖ మంత్రితో మాట్లాడామన్నారు. నిర్బంధంలో ఉన్న తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నారని తమతో చెప్పారన్నారు. త్వరలో వారందరినీ దేశానికి తీసుకువస్తామన్నారు
తాజా వార్తలు
- హనీట్రాప్ కేసులో సంచలనం: 9 మంది పోలీసులపై కఠిన చర్యలు
- ఏపీ రాష్ట్రానికి 750 ఎలక్ట్రిక్ బస్సులు
- తెలంగాణలో యువతకు శిక్షణ.. అనంతరం జపాన్, జర్మనీలో ఉద్యోగాలు
- ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- ప్రతీ పల్లెకు ఆర్టీసీ బస్సు: రేవంత్ ప్రభుత్వం శుభవార్త
- దుబాయ్ స్కూళ్లలో పీఈ క్లాసులకు ఆమోదం..!!
- సౌదీలో 500కు పైగా హెరిటేజ్ ప్రదేశాల్లో పునరుజ్జీవ కార్యక్రమాలు..!!
- బహ్రెయిన్ లో స్కూల్ అడ్మిషన్లు ప్రారంభం..!!
- షార్జాలో Dh3 మిలియన్ ఫ్రాడ్..క్రిమినల్ నెట్వర్క్ అరెస్టు..!!
- కువైట్కు సంఘీభావంగా బెంగాలీ సొసైటీ..క్రాఫ్ట్ వర్క్షాప్..!!









