ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమం... పల్లె రఘునాథ్రెడ్డి,,
- October 12, 2016
ఇథియోపియాలోని తెలుగు ప్రొఫెసర్లంతా క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డి తెలిపారు. వారిని త్వరలో దేశానికి తీసుకువస్తామని బుధవారం అనంతపురంలో ఆయన మీడియాకు చెప్పారు. ఇథియోపియాలోని మడమాల విశ్వవిద్యాలయంలో రాష్ర్టానికి చెందిన తెలుగు ప్రొఫెసర్లు చాలామంది నిర్బంధంలో ఉన్నారన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ యంత్రాంగం యావత్తు వెంటనే స్పందించిందన్నారు. రాష్ట్ర యంత్రాంగం విదేశ వ్యవహారాల మంత్రితో ఫోన్లో మాట్లాడిందని, అంతేకాకుండా ఆ దేశ ఎంబసీతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నదని వెల్లడించారు.ఆ దేశ విద్యా శాఖ మంత్రితో మాట్లాడామన్నారు. నిర్బంధంలో ఉన్న తెలుగు ప్రొఫెసర్లు క్షేమంగా ఉన్నారని తమతో చెప్పారన్నారు. త్వరలో వారందరినీ దేశానికి తీసుకువస్తామన్నారు
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







