గౌరవమర్యాదలు, డబ్బు ఇచ్చింది తెలుగు పరిశ్రమే....

- October 12, 2016 , by Maagulf
గౌరవమర్యాదలు, డబ్బు ఇచ్చింది తెలుగు పరిశ్రమే....

ప్రభుదేవా, తమన్నా, సోనూసూద్‌ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'అభినేత్రి'. విజరు దర్శకత్వం వహించారు. కోన ఫిలిం కార్పొరేషన్‌ సమర్పణలో ఎం.వి.వి. సినిమా పతాకంపై ఎం.వి.వి.సత్యనారాయణ బ్లూ సర్కిల్‌ కార్పొరేషన్‌, బి.ఎల్‌.ఎన్‌. సినిమాతో కలిసి ఈ చిత్రాన్ని తెలుగులో నిర్మించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైంది. దసరా రోజున హైదరాబాద్‌లో సక్సెస్‌ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్‌రక్షిత్‌, శేఖర్‌, జానీ, దినేష్‌ మాస్టర్లు కలిసి ప్రభుదేవాను సత్కరించారు. దర్శకుడు ఎ.ఎల్‌.విజరు మాట్లాడుతూ 'పండక్కి మంచి విజయం అందించారు. మూడు భాషల్లోనూ మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మెయిన్‌ పిల్లర్‌ కోన వెంకట్‌ చాలా బాగా చేశారు.
ప్రభు సపోర్ట్‌ మర్చిపోలేను' అని అన్నారు. ప్రభుదేవా మాట్లాడుతూ ''నేను ముంబైలో ఉంటే డైరెక్టర్‌ని అవుతాను. చెన్నైలో ఉంటే హీరో అవుతాను. హైదరాబాద్‌లో ఉంటే డ్యాన్స్‌ మాస్టర్‌ అవుతాను.నాకు గౌరవమర్యాదలు, డబ్బు ఇచ్చింది తెలుగు పరిశ్రమే. ఇక్కడ కూడా చాలా మంది కొరియోగ్రాఫర్లు అద్భుతంగా చేస్తున్నారు. పండక్కి మంచి విజయం దక్కింది. చాలా ఆనందంగా ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com