ఏకకాలంలో మూడు తమిళ సినిమాలకు ఎంపికైన రకుల్ ..
- October 13, 2016
ఆనంద్శంకర్ దర్శకత్వంలోని 'ఇరుముగన్' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించారు నటుడు విక్రం. చాలా కాలం తర్వాత ఒకింత హిట్ను సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్నారు ఆయన. ప్రస్తుతం ఆయన హరి దర్శకత్వంలో 'సామి 2'లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. విక్రం హీరోగా తిరునెల్వేలి నేపథ్యంలో విడుదలైన 'సామి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్ రానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కూడా త్రిష కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరో కథానాయికగా రకుల్ప్రీత్సింగ్ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం సూర్య నటిస్తున్న 'ఎస్ 3'లో బిజీగా ఉన్న హరి.. ఆ సినిమా పూర్తయిన వెంటనే 'సామి 2'పై దృష్టి పెట్టనున్నారు. రకుల్కు మరింత ప్రాధాన్యత ఉన్న పాత్రను కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది రకుల్.విశాల్ హీరోగా 'తుప్పరివాలన్'లో కూడా కథానాయికగా ఎంపికైంది. మొత్తానికి ఏకకాలంలో మూడు తమిళ సినిమాలకు ఎంపికైంది రకుల్ ప్రీత్సింగ్.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







