ఏకకాలంలో మూడు తమిళ సినిమాలకు ఎంపికైన రకుల్‌ ..

- October 13, 2016 , by Maagulf
ఏకకాలంలో మూడు తమిళ సినిమాలకు ఎంపికైన రకుల్‌ ..

ఆనంద్‌శంకర్‌ దర్శకత్వంలోని 'ఇరుముగన్‌' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించారు నటుడు విక్రం. చాలా కాలం తర్వాత ఒకింత హిట్‌ను సొంతం చేసుకున్న ఆనందంలో ఉన్నారు ఆయన. ప్రస్తుతం ఆయన హరి దర్శకత్వంలో 'సామి 2'లో నటించేందుకు సిద్ధమవుతున్నారు. విక్రం హీరోగా తిరునెల్వేలి నేపథ్యంలో విడుదలైన 'సామి' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌ రానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో కూడా త్రిష కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా మరో కథానాయికగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.ప్రస్తుతం సూర్య నటిస్తున్న 'ఎస్‌ 3'లో బిజీగా ఉన్న హరి.. ఆ సినిమా పూర్తయిన వెంటనే 'సామి 2'పై దృష్టి పెట్టనున్నారు. రకుల్‌కు మరింత ప్రాధాన్యత ఉన్న పాత్రను కేటాయించినట్లు సమాచారం. ప్రస్తుతం ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న చిత్రంలో నటిస్తోంది రకుల్‌.విశాల్‌ హీరోగా 'తుప్పరివాలన్‌'లో కూడా కథానాయికగా ఎంపికైంది. మొత్తానికి ఏకకాలంలో మూడు తమిళ సినిమాలకు ఎంపికైంది రకుల్‌ ప్రీత్‌సింగ్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com