దొంగతనం చేస్తున్న ఇద్దరు ఆసియా దేశస్థులు అరెస్టు
- October 14, 2016
కువైట్:అదనపు ఆదాయం కోసం...అన్నం పెట్టిన సంస్థకే కన్నం వేశారా ప్రబుద్ధులు...అయితే, అక్రమం ఎన్నాళ్ళో సాగదు కాబట్టి వారి చోరకళకు భద్రతా దళాలు చెక్ పెట్టారు. కువైట్ లోని ఒక ప్రజా ఆసుపత్రిలో పని చేస్తున్న ఇద్దరు ఆసియా దేశస్థులు తాము పనిచేస్తున్న చోటు నుంచి మాదక ద్రవ్యాలు మరియు ఇతర మందులను ఇటీవల దొంగిలించి విక్రయిస్తున్న నేపథ్యంలో వారిరువురిని అరెస్టు చేశారు. భద్రతా దళాల సమాచారం ప్రకారం ఈ అనుమానితులు రోజూ వారి జేబులలో ఆయా మాత్రలు పెట్టుకొని తమ తమ ఇళ్లకు చేర్చుకొనేవారు. మూడవ నిందితునికి విక్రయించే ముందు వారి నివాసంలో మాదక ద్రవ్యాలు మరియు ఇతర మందులను నిల్వ చేసేవారని తెలిపారు. ఆ మందులు అమ్మడం ద్వారా వారు సేకరించిన 1100 కువైట్ దినార్ల నగదు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకొన్నారు.అలాగే, వారి వద్ద అమ్మకానికి సిద్ధంగా ఉన్న8.064 మాత్రలను సైతం సీజ్ చేశారు. ఆసుపత్రి నుంచి దోచుకున్న మందుల విలువ బహిరంగా మార్కెట్ లో 10,000 కువైట్ దినార్ల విలువ వరకు ఉంటుందని భద్రతా దళాలు అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









