శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలకపాత్ర - నాయిని నరసింహారెడ్డి
- October 15, 2016
రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్ ప్లాజాలో ఏర్పాటు చేసిన పోలీసు ఎక్స్పోను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ఎంతోమంది పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తున్నారన్నారు. అమరవీరుల త్యాగాలు మరపురానివన్నారు. ఈ ప్రదర్శనలో సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ సహా పోలీసు విభాగాలకు చెందిన అత్యాధునికి తుపాకులు, ఆయుధాలు, కేసుల దర్యాప్తు సందర్భంగా ఉపయోగించే పలు రకాల వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







