శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలకపాత్ర - నాయిని నరసింహారెడ్డి

- October 15, 2016 , by Maagulf
శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులది కీలకపాత్ర - నాయిని నరసింహారెడ్డి

రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తారని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన పోలీసు ఎక్స్‌పోను హోంమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం కోసం ఎంతోమంది పోలీసు అధికారులు, సిబ్బంది తమ ప్రాణాలను లెక్కచేయకుండా సేవలందిస్తున్నారన్నారు. అమరవీరుల త్యాగాలు మరపురానివన్నారు. ఈ ప్రదర్శనలో సీఆర్‌పీఎఫ్‌, బీఎస్‌ఎఫ్‌ సహా పోలీసు విభాగాలకు చెందిన అత్యాధునికి తుపాకులు, ఆయుధాలు, కేసుల దర్యాప్తు సందర్భంగా ఉపయోగించే పలు రకాల వస్తువులను ప్రదర్శనలో ఉంచారు. పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com