ఫిలిపీన్స్ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది
- October 16, 2016
ఫిలిపీన్స్ దేశాన్ని మరోసారి తుపాను అల్లకల్లోలం చేసింది. ఆదివారం ఉదయం కారికా(కరేన్) తుపాను చెలరేగడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, వందలమంది నిరాశ్రయులయ్యారు. వరదల ధాటికి గల్లంతైన వారి సంఖ్య తెలియడం లేదు. గంటకు 130కి.మీ. నుంచి 220కి.మీ. వేగంతో వీచిన పెనుగాలులతో అనేక చోట్ల భారీ వృక్షాలు నేలకూలాయి.
పలు చోట్ల ఇళ్లు ధ్వంసమయ్యాలు, విద్యుత్ స్తంభాలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాలు అంధకారంలో చిక్కుకుపోయాయి. తీరప్రాంతాల ప్రజల్ని వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించి, గాయపడ్డవారికి చికిత్స చేయిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
చేపల వేటకు వెళ్లిన ముగ్గురు మత్స్యకారులు అదృశ్యమైనట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







