దుబాయ్లో ఉచితంగా బుక్స్ ఆర్డర్
- October 16, 2016
దుబాయ్: కోరుకున్న పుస్తకాన్ని ఇంటి వద్దే ఉచితంగా పొందే అవకాశం దుబాయ్లోని చిన్నారులు, వారి తల్లిదండ్రులకు కలగనుంది. నాలెడ్జ్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ అథారిటీ (కెహెచ్డిఎ) మరియు కరీమ్ ఈ ప్రోగ్రామ్ని లాంఛ్ చేసింది. అక్టోబర్ 31 వరకు ఈ ప్రోగ్రామ్ అమల్లో ఉంటుంది. కరీమ్ యాప్ ద్వారా పుస్తకాల్ని బుక్ చేసుకుంటే, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కార్ల ద్వారా పుస్తకాలు బుక్ చేసినవారి ఇంటికి ఉచితంగా వచ్చేస్తాయి. కెహెచ్డిఎ హ్యాపీనెస్ అండ ఇన్నోవేషన్ చీఫ్ ఆఫ్ క్రియేటివిటీ హింద్ అల్ ముల్లా మాట్లాడుతూ కరీడ్స్, పబ్లిక్ అండ్ ప్రైవేట్సెక్టార్ సంయుక్తంగా పనిచేయడం ద్వారా చదవడాన్ని ఇష్టంగా మార్చేందుకు వీలు కల్గిందని చెప్పారు. కరీడ్స్ కార్లు పలు బుక్స్ని కలిగి ఉంటాయనీ, యంగ్స్టర్స్, చిల్డ్రన్ కోసం ఇంగ్లీషు మరియు అరబిక్ భాషల్లో అవి లభ్యమవుతాయని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







