ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం
- October 17, 2016
ఒడిషాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. భువనేశ్వర్లోని ఐఎంఎస్ & ఎస్యూఎం ఆస్పత్రిలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 22 మంది మృతి చెందగా, 75 మందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఐసీయూ వార్డులో కూడా మంటలు వ్యాపించాయి. దీంతో ఆ వార్డులో కదలలేని స్థితిలో ఉన్న వారు అక్కడికక్కడే కాలిపోయారు. మొదట డయాలసిస్ వార్డులో మంటలు చెలరేగి, మెడిసిన్, ఐసీయూ వార్డులకు మంటలు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, 5 అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పుతున్నారు. చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు రూ. 5 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు రూ.50వేలు పరిహారాన్ని అందిస్తామని రాష్ట్రప్రభుత్వం ప్రకటించింది. షాక్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. క్షతగాత్రుల్లో కొంత మంది పరిస్థితి విషమంగా మారింది. మృతులు, క్షతగాత్రుల వివరాలను తమకు పంపాలంటూ కేంద్రం తెలిపింది.
ఐసీయూలో ఉన్నవారు కూడా చనిపోయిన వ్యక్తుల్లో ఉండటం గమనార్హం. 9ఫైరింజన్లు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







