6 నెలలుగా అందని వేతనాలు- పస్తులతో అజ్మన్ కార్మికులు
- August 19, 2015
అజ్మన్ లోని ఒక కార్మిక వసతిగృహంలో ఉన్న 200 పైగా కార్మికులు ఆహారం, నిత్యావసరాల సరఫరా లేక పస్తులుంటున్నారు. అజ్మన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని ఎస్సా ఎంజినీరింగ్ అండ్ మరైన్ సర్వీసెస్ శ్రామికులు చట్టపరమైన సందిగ్ధతల వల్ల గత ఆరు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. పులి మీద పుట్రలా, ఈ ప్రాంతానికి నీరు, కరెంటు సరఫరా కూడా నిలిపివేయడంతో, వంటచేసుకోడానికి విరిగిపోయిన సామాన్లను, సమీపంలోనున్న మసీదు నుండి నీటిని తెచ్చుకుని ప్రాణం నిలుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా 37 సంవత్సరాల భారతీయుడోకరు అధిక వేడికి తాళలేక ఆగస్టు 9 న మరణించినట్టు తోటి శ్రామికులు చెప్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







