6 నెలలుగా అందని వేతనాలు- పస్తులతో అజ్మన్ కార్మికులు

- August 19, 2015 , by Maagulf
6 నెలలుగా అందని వేతనాలు- పస్తులతో అజ్మన్ కార్మికులు

అజ్మన్ లోని ఒక కార్మిక వసతిగృహంలో ఉన్న 200 పైగా కార్మికులు ఆహారం,  నిత్యావసరాల సరఫరా లేక పస్తులుంటున్నారు. అజ్మన్ ఇండస్ట్రియల్ ప్రాంతంలోని  ఎస్సా ఎంజినీరింగ్ అండ్ మరైన్ సర్వీసెస్ శ్రామికులు చట్టపరమైన సందిగ్ధతల వల్ల గత ఆరు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. పులి మీద పుట్రలా, ఈ ప్రాంతానికి నీరు, కరెంటు సరఫరా కూడా నిలిపివేయడంతో, వంటచేసుకోడానికి విరిగిపోయిన సామాన్లను, సమీపంలోనున్న మసీదు నుండి నీటిని తెచ్చుకుని ప్రాణం నిలుపుకుంటున్నారు. ఇదిలా ఉండగా 37 సంవత్సరాల భారతీయుడోకరు అధిక వేడికి తాళలేక ఆగస్టు 9 న మరణించినట్టు తోటి శ్రామికులు చెప్తున్నారు.

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com