కేరళలో యూఏఈ కాన్సులేట్ ప్రారంభం
- October 20, 2016
కేరళలో యూఏఈ కాన్సులేట్ జనరల్ ప్రారంభమయ్యింది. జమాల్ అల్ జాబి, కేరళలో యూఏఈ కాన్సుల్ జనరల్గా నియమించబడ్డారు. ఇండియాలో ప్రారంభించిన రెండవ కాన్సులేట్ ద్వారా ఇరుదేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఇంకా బాగా పెరుగుతాయని యూఏఈ మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్ మరియు ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. కొత్త కాన్సులేట్ కార్యాలయం ప్రారంభించడం ద్వారా ఇరుదేశాల మధ్య వ్యాపార, ఆర్థిక సత్సంబంధాలు ఇంకా బలపడ్తాయనీ, అలాగే సామాజిక, సాంస్కృతిక సంబంధాలు మెరుగుపడ్తాయని ఆకాంక్షించారు జమాల్ అల్ జాబి. ఇంటీరియర్ మినిస్ట్రీ సహాయంతో కాన్సులేట్, కేరళను సందర్శించే యూఏఈ పౌరులకు వీసాలను మంజూరు చేయనుంది. అలాగే కేరళ రెసిడెంట్స్కి కూడా ఈ సేవలు అందుతాయి. యూఏఈ, ఇండియా సత్సంబంధాలకు కేరళ ముఖ ద్వారంగా మారిందని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. కేరళ నుంచి వస్తున్నవారికి యూఏఈలో మెరుగైన ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయని, అలాగే కేరళతో యూఏఈ బంధం ప్రత్యేకమైనదని యూఏఈ ప్రతినిథులు చెప్పారు.
తాజా వార్తలు
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం
- గద్దర్ ఫిలిం అవార్డ్స్: విజేతల పూర్తి జాబితా ఇదే!
- బెంగళూరుకు రెండో అంతర్జాతీయ విమానాశ్రయం!
- సీఎం సమక్షంలో 124 మంది మావోయిస్టుల లొంగుబాటు
- క్షమించడండి అంటూ ఇరాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
- *బ్రేకింగ్: విమాన సర్వీసులను పునరుద్ధరించిన ఎమిరేట్స్! కన్ఫర్మ్డ్ టికెట్ ఉన్న ప్రయాణీకులకే!
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!









