మసాలా కిచిడీ
- August 19, 2015
కావాల్సిన పదార్ధాలు
బియ్యం, పెసరపప్పు - ఒక కప్పు చొప్పున
నెయ్యి - ఒక కప్పు
బఠానీలు - ఒక కప్పు
క్యారెట్, బీన్స్, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
తాలింపు కోసం
అవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఇంగువా, గరం మసాలా సరిపడినంత తీసుకోవాలి.
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని, పెసరపప్పును కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని, దానిలో రెండు కప్పుల నీళ్లు పోసి, అదే గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలను కూడా వేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఇప్పుడు వేరొక బాణలిలో తాలింపు సామాన్లు అన్నీ వేసి, పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి వేగాక ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొత్తిమీర తరుగు కూడా వేసి మంట తగ్గించాలి.తరువాత దీనిలో ముందుగా వండి పెట్టిన పెసరపప్పు అన్నం వేసి బాగా కలిపి, దానిలో మరికొంచెం నీళ్లు పోసి కొద్ది సేపు ఉడికించాలి. కాసేపటికి ఇది కిచిడీలా తయారవుతుంది. అంతే మసాలా కిచిడీ రెడీ.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









