మసాలా కిచిడీ
- August 19, 2015
కావాల్సిన పదార్ధాలు
బియ్యం, పెసరపప్పు - ఒక కప్పు చొప్పున
నెయ్యి - ఒక కప్పు
బఠానీలు - ఒక కప్పు
క్యారెట్, బీన్స్, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
తాలింపు కోసం
అవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఇంగువా, గరం మసాలా సరిపడినంత తీసుకోవాలి.
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని, పెసరపప్పును కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని, దానిలో రెండు కప్పుల నీళ్లు పోసి, అదే గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలను కూడా వేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఇప్పుడు వేరొక బాణలిలో తాలింపు సామాన్లు అన్నీ వేసి, పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి వేగాక ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొత్తిమీర తరుగు కూడా వేసి మంట తగ్గించాలి.తరువాత దీనిలో ముందుగా వండి పెట్టిన పెసరపప్పు అన్నం వేసి బాగా కలిపి, దానిలో మరికొంచెం నీళ్లు పోసి కొద్ది సేపు ఉడికించాలి. కాసేపటికి ఇది కిచిడీలా తయారవుతుంది. అంతే మసాలా కిచిడీ రెడీ.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







