మసాలా కిచిడీ
- August 19, 2015
కావాల్సిన పదార్ధాలు
బియ్యం, పెసరపప్పు - ఒక కప్పు చొప్పున
నెయ్యి - ఒక కప్పు
బఠానీలు - ఒక కప్పు
క్యారెట్, బీన్స్, టొమాటో ముక్కలు - అరకప్పు చొప్పున
పసుపు - చిటికెడు
ఉప్పు - తగినంత
తాలింపు కోసం
అవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం తరుగు, ఇంగువా, గరం మసాలా సరిపడినంత తీసుకోవాలి.
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని, పెసరపప్పును కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని, దానిలో రెండు కప్పుల నీళ్లు పోసి, అదే గిన్నెలో తరిగిన కూరగాయ ముక్కలను కూడా వేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చే వరకూ ఉడికించాలి. ఇప్పుడు వేరొక బాణలిలో తాలింపు సామాన్లు అన్నీ వేసి, పచ్చి మిర్చి, అల్లం తరుగు వేసి వేగాక ఉప్పు, కారం, గరం మసాలా వేసి కొత్తిమీర తరుగు కూడా వేసి మంట తగ్గించాలి.తరువాత దీనిలో ముందుగా వండి పెట్టిన పెసరపప్పు అన్నం వేసి బాగా కలిపి, దానిలో మరికొంచెం నీళ్లు పోసి కొద్ది సేపు ఉడికించాలి. కాసేపటికి ఇది కిచిడీలా తయారవుతుంది. అంతే మసాలా కిచిడీ రెడీ.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









