వైవిధ్యమైన పాత్రలు వస్తేనే నటిస్తా: త్రిష.
- October 20, 2016
'అరణ్మనై 2'లో దెయ్యంగా నటించి మెప్పించారు త్రిష. ఆ తర్వాత 'నాయికి'గా కూడా తెలుగు, తమిళ ప్రేక్షకులను బెంబేలెత్తించారు. ఈ నేపథ్యంలో ఆమె మరో దెయ్యం సినిమాకు సిద్ధమయ్యారు. ఆర్ మాధేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మోహిని' అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేశారు. ప్రచండ రూపంలో కనిపిస్తోంది త్రిష. కథలోకి వెళితే.. ఓ ముఠా హతమార్చడంతో దెయ్యంగా మారుతున్న త్రిష వారిని హతమార్చేందుకు ప్రయత్నిస్తుంది. దేశవిదేశాల్లో ఉన్న ఆ వ్యక్తులను ఎలా హతమార్చి పగ తీర్చుకుందన్న విషయాన్ని ఆసక్తికరంగా చెప్పామని అంటున్నారు దర్శకుడు మాదేష్.ఆయన గతంలో విజయ్ హీరోగా 'మదుర' అనే సినిమాను తెరకెక్కించారు. సినిమా గురించి త్రిష మాట్లాడుతూ.. నేను మునుపటిలా లేను. కథ విని నా పాత్ర నచ్చితేనే నటిస్తున్నా.ఓ నటిగా పలురకాల నటనను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం వరుసగా దెయ్యం చిత్రాలను ఎంచుకుంటున్నా. ఆ రకంగా నేను సంతృప్తి పొందాను. ఇకపై దెయ్యం చిత్రాలపై పెద్దగా ఆసక్తి కనబరచను. బహుశా నా చివరి దెయ్యం సినిమా 'మోహిని' కావచ్చు.వైవిధ్యమైన పాత్రలు వస్తేనే ఇకపై నటిస్తానని చెప్పారు త్రిష.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







