వైవిధ్యమైన పాత్రలు వస్తేనే నటిస్తా: త్రిష.

- October 20, 2016 , by Maagulf
వైవిధ్యమైన పాత్రలు వస్తేనే  నటిస్తా: త్రిష.

'అరణ్మనై 2'లో దెయ్యంగా నటించి మెప్పించారు త్రిష. ఆ తర్వాత 'నాయికి'గా కూడా తెలుగు, తమిళ ప్రేక్షకులను బెంబేలెత్తించారు. ఈ నేపథ్యంలో ఆమె మరో దెయ్యం సినిమాకు సిద్ధమయ్యారు. ఆర్‌ మాధేష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి 'మోహిని' అని పేరు పెట్టారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రచండ రూపంలో కనిపిస్తోంది త్రిష. కథలోకి వెళితే.. ఓ ముఠా హతమార్చడంతో దెయ్యంగా మారుతున్న త్రిష వారిని హతమార్చేందుకు ప్రయత్నిస్తుంది. దేశవిదేశాల్లో ఉన్న ఆ వ్యక్తులను ఎలా హతమార్చి పగ తీర్చుకుందన్న విషయాన్ని ఆసక్తికరంగా చెప్పామని అంటున్నారు దర్శకుడు మాదేష్‌.ఆయన గతంలో విజయ్‌ హీరోగా 'మదుర' అనే సినిమాను తెరకెక్కించారు. సినిమా గురించి త్రిష మాట్లాడుతూ.. నేను మునుపటిలా లేను. కథ విని నా పాత్ర నచ్చితేనే నటిస్తున్నా.ఓ నటిగా పలురకాల నటనను వ్యక్తపరచాలన్న ఉద్దేశంతోనే ప్రస్తుతం వరుసగా దెయ్యం చిత్రాలను ఎంచుకుంటున్నా. ఆ రకంగా నేను సంతృప్తి పొందాను. ఇకపై దెయ్యం చిత్రాలపై పెద్దగా ఆసక్తి కనబరచను. బహుశా నా చివరి దెయ్యం సినిమా 'మోహిని' కావచ్చు.వైవిధ్యమైన పాత్రలు వస్తేనే ఇకపై నటిస్తానని చెప్పారు త్రిష.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com