అరామ్కో ఆయిల్ కంపెనీ వద్ద గాయపడిన ఇరువురు కార్మికులు మృతి
- October 21, 2016
రియాద్ సమీపంలో అరామ్కో ఆయిల్ కంపెనీ లో ఇటీవల జరిగిన ఒక అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడగా అందులో ఇరువురు కార్మికులు గురువారం చనిపోయినట్లు సంబంధిత యాజమాన్యం తెలిపింది. ముడి చమురు సేకరించే అరామ్కో కంపెనీ వద్ద బుధవారం సాయంత్రం 3 గంటలప్పుడు పలువురు కార్మికులు పని చేస్తున్నసమయంలో అకస్మాత్ముగా అలవీసా ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదకారణంగా పలువురు కార్మికులు గాయపడ్డారు. కాగా ప్రస్తుతం వారికి చికిత్స చేస్తున్నారని తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికులలోఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతుండగా వారిలో ఇరువురు గురువారం మరణించారని అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ ఖాతాలో గురువారం కంపెనీ ఒక పోస్ట్ పెట్టింది. దీని కారణంగా సంస్థ యొక్క కార్యకలాపాలపై ఏమాత్రం ప్రభావం లేదని తెలిపారు. 17 మంది కింగ్ అబ్దుల్ అజిజ్ మెడికల్ సిటీ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కాగా చనిపోయినవారి గురించి ఎటువంటి వివరాలు ఆ పోస్ట్ లో తెలియచేయలేదు. గత సెప్టెంబర్ లో జరిగిన అరామ్కో యొక్క గల్ఫ్ తీరం రాస్ తానురా ఆయిల్ టెర్మినల్ మంటలు చెలరేగి ఒక అగ్నిప్రమాదంలో ఎనిమిదిమంది కార్మికులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన
- ఇరాన్ దాడుల ప్రభావం.. బహ్రెయిన్, కువైట్, ఖతార్ విమానాలకు అంతరాయం
- ఏపీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్..
- డీజీపీ సీవీ ఆనంద్ ని కలిసిన క్రికెటర్ మహమ్మద్ సిరాజ్
- సెప్టెంబర్లో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ సీజన్ 10
- బహ్రెయిన్ వైమానిక నావిగేషన్ పరికరాలే లక్ష్యం..అయినా విమాన రాకపోకలకు అంతరాయం లేదు
- ఢిల్లీ ఘటన పై తెలంగాణ సీఎం రేవంత్ ఫైర్..
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు..కువైట్ పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ‘రాజు ఆమ్లెట్’ వ్యవస్థాపకుడు రాజీవ్ మెహెరిష్ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్ట్ సేవలకు ఊరట.. అల్హింద్ ద్వారా తాత్కాలికంగా కాన్సులర్ సేవలకు సుప్ర







