అరామ్కో ఆయిల్ కంపెనీ వద్ద గాయపడిన ఇరువురు కార్మికులు మృతి
- October 21, 2016
రియాద్ సమీపంలో అరామ్కో ఆయిల్ కంపెనీ లో ఇటీవల జరిగిన ఒక అగ్నిప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడగా అందులో ఇరువురు కార్మికులు గురువారం చనిపోయినట్లు సంబంధిత యాజమాన్యం తెలిపింది. ముడి చమురు సేకరించే అరామ్కో కంపెనీ వద్ద బుధవారం సాయంత్రం 3 గంటలప్పుడు పలువురు కార్మికులు పని చేస్తున్నసమయంలో అకస్మాత్ముగా అలవీసా ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదకారణంగా పలువురు కార్మికులు గాయపడ్డారు. కాగా ప్రస్తుతం వారికి చికిత్స చేస్తున్నారని తీవ్రంగా గాయపడిన ముగ్గురు కార్మికులలోఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్స పొందుతుండగా వారిలో ఇరువురు గురువారం మరణించారని అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు ట్విట్టర్ ఖాతాలో గురువారం కంపెనీ ఒక పోస్ట్ పెట్టింది. దీని కారణంగా సంస్థ యొక్క కార్యకలాపాలపై ఏమాత్రం ప్రభావం లేదని తెలిపారు. 17 మంది కింగ్ అబ్దుల్ అజిజ్ మెడికల్ సిటీ ఆసుపత్రిలో ఇంకా చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కాగా చనిపోయినవారి గురించి ఎటువంటి వివరాలు ఆ పోస్ట్ లో తెలియచేయలేదు. గత సెప్టెంబర్ లో జరిగిన అరామ్కో యొక్క గల్ఫ్ తీరం రాస్ తానురా ఆయిల్ టెర్మినల్ మంటలు చెలరేగి ఒక అగ్నిప్రమాదంలో ఎనిమిదిమంది కార్మికులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు









