గల్ఫ్కు పరారైన కాల్ సెంటర్ స్కామ్ ప్రధాన సూత్రధారి...
- October 23, 2016
కోట్లాది రూపాయల థానే కాల్ సెంటర్ స్కామ్ ప్రధాన సూత్రధారి సాగర్ థక్కర్ అలియాస్ షాగ్గీ దేశం విడిచి పరారయ్యాడు. ఓవైపు థానే క్రైం బ్రాంచ్ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్న సమయంలోనే థక్కర్ గుట్టుచప్పుడు కాకుండా దేశం నుంచి ఉడాయించాడు. ఈనెల 5న అతను దేశం విడిచి పారిపోయినట్టు అధికారులు తెలిపారు. థానే జిల్లాలోని మీరారోడ్లో నకిలీ కాల్సెంటర్లు ఏర్పాటు చేసి పన్ను ఎగ్గొట్టినట్లుగా తమ మాటలతో అమెరికన్లను మభ్యపెట్టి వారి నుంచి వందల కోట్లు కొల్లగొట్టిన ఉదంతం ఇటీవల బయటపడటం సంచలనమైంది. దీంతో పలు కాల్సెంటర్లపై పోలీసు బృందాలు ఈనెల 4-5 తేదీల్లో దాడులు నిర్వహించాయి. 70 మంది డైరెక్టర్లు, అసోసియేట్లను అరెస్టు చేసి, 700 మంది ఉద్యోగులను అదుపులోనికి తీసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో థక్కర్ వ్యవహారం బయటపడింది. అప్పటికే అతను దేశం విడిచివెళ్లిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఈనెల 7న థక్కర్పై 'లుక్ అవుట్ సర్క్యులర్'ను పోలీసులు జారీ చేశారు. థక్కర్ దుబాయ్ పారిపోయినట్టుగా అనుమానిస్తున్నారు.
కాగా, విచారణలో థక్కర్ పెద్ద సోదరి రీమా థక్కర్ కూడా ఈనెల 8న న్యూఢిల్లీ నుంచి దేశం విడిచి పారిపోయినట్టు వెల్లడైంది.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







