మోర్టార్ షెల్లింగ్ దాడులతో పాకిస్థాన్ విరుచుకుపడింది...
- October 24, 2016
సరిహద్దుల్లో దాయాది పాకిస్థాన్ మరోసారి బరితెగించింది. జమ్మూ ఆర్ఎస్ పుర సెక్టర్లోని అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా భారీ కాల్పులు, మోర్టార్ షెల్లింగ్ దాడులతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాను ఒకరు మృతి చెందగా.. ముగ్గురు జవానుకు గాయాలయ్యాయి. పాక్ రేంజర్స్ కాల్పుల్లో గాయపడిన జవానును వెంటనే జమ్మూలోని ఆస్పత్రికి తరలించినా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. మరో జవాను చికిత్స పొందుతున్నాడు.ఆర్ఎస్ పుర సెక్టర్లో అంతర్జాతీయ సరిహద్దుల మీదుగా ఆదివారం పాక్ రేంజర్లు రెండుసార్లు కాల్పుల ఉల్లంఘనకు పాల్పడ్డారు. మోర్టార్ షెల్స్ర, తక్కువస్థాయి ఆయుధాలతో కాల్పులకు దిగారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







