కాలిఫోర్నియాలో రోడ్డుప్రమాదం :13మంది మృతి, 31మంది గాయాలు..
- October 24, 2016
అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 13 మంది మృతిచెందగా.. 31 మంది గాయపడ్డారు.పర్యాటకులతో వెళ్తున్న బస్సు ఆదివారం రాత్రి అదుపుతప్పి ట్రాక్టరును ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..ఉత్తర కాలిఫోర్నియా నుంచి లాస్ఏంజిల్స్ వైపు ప్రయాణిస్తున్న పర్యటకుల బస్సు పామ్ స్ప్రింగ్స్ వద్దకు రాగానే అదుపుతప్పి ట్రాక్టర్పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ సహా 13మంది అక్కడిక్కడే మృతిచెందగా మరో 31మంది గాయాలపాలయ్యారుసమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. మరోవైపు ప్రమాదానికి కారణం అతివేగమా? లేక డ్రైవర్ మద్యం సేవించడమా? అన్న కోణంలో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!







