కతర్ ప్రపంచ కప్ స్టేడియం వద్ద కార్మికుని మృతి
- October 24, 2016
దోహా: ఖతార్ వరల్డ్ కప్ నిర్వాహకులు 2022 టోర్నీకి నిర్మాణంలో ఉన్న స్టేడియంలలో పనిచేస్తున్నఒక కార్మికుడు ఒక "పని సంబంధిత" సంఘటనలో మరణించాడని ప్రకటించారు. ఇదే మొదటిసారిగా కతర్ ప్రపంచ కప్ నిర్వాహకులు టోర్నమెంట్ కు సంబంధించి పని సంబంధిత మరణవార్తని ప్రకటించాయి.మా ప్రణాళికలలో భాగంగా యధావిధిగా పని మొదలు పెట్టిన కొద్దిసేపటికి ఆ దుర్ఘటన జరిగిందని నిర్వాహకులు తెలిపారు శనివారం ఉదయం అల్-వాకరః స్టేడియంలో జరిగిన సంఘటన" ఒక పని సంబంధిత మరణ ప్రకటించి ఇందుకు ఎంతో విచారం వ్యక్తం చేస్తున్నట్లు లెగసీ అత్యున్నత కమిటీ తెలిపింది. మా కార్మికుడు ఒకరి మరణంకు దోహదపడిన కారణాలు గుర్తించేందుకు ఒక పూర్తిస్థాయి విచారణ జరుపుతున్నట్లు పేర్కొంది. కార్మికుని మరణంపై దారి తీసిన పరిస్థితులు గూర్చి గాని సంఘటన స్వభావం గూర్చి గాని , మరణించిన కార్మికుడు గుర్తింపు వివరాలు గాని ఆ ప్రకటనలో ఇవ్వలేదు. విదేశీ కార్మికుల పట్ల సంబంధిత నిర్మాణ సంస్థ చూపుతున్న వైఖరి పట్ల ఖతార్ విస్తృతంగా ఖండించాయి.30 బిలియన్ డాలర్లతో నిర్మాణమవుతున్న స్టేడియంలను సహాయపడుతున్న కార్మికులు మరణాలు సమస్య దీర్ఘ వివాదాస్పదంగా మారింది.విమర్శకులు పేర్కొంటున్న వివరాల ప్రకారం దాదాపు 1,200 మంది కార్మికులు ఇప్పటికే మరణించారని తెలియచేస్తున్నారు. మరియు ప్రపంచ కప్ మొదలవడానికి ముందే 4,000 మంది కార్మికులను విదులలోంచి తొలగించనున్నారు.ఖతార్ ఒక 2015 ముగింపులో విడుదల చేసిన ప్రభుత్వ లెక్కల ప్రకారం, మొత్తం కార్మికుల్లో 85 శాతం 1.6 మిలియనల మంది వలస కార్మికులు ఉంటారని అంచనా కతర్ లో ప్రపంచ కప్ స్టేడియం నిర్మాణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల సంఖ్య 2018 నాటికి 36,000 మంది వరకు ఉండవచ్చని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







