మీడియా నేపథ్యంలో సాగే కథ 'మనలో ఒకడు'
- October 24, 2016
కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా 'మనలో ఒకడు' కథను రాసుకున్నామని, మీడియా నేపథ్యంలో సాగే కథ ఇదని ప్రధాన పాత్రధారి, దర్శకుడు ఆర్పీ.పట్నాయక్ పేర్కొన్నారు. యూనిక్రాఫ్ట్ మూవీస్ పతాకంపై జగన్మోహన్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. 'నువ్వు నేను' ఫేమ్ అనితా.హెచ్.రెడ్డి కథానాయికగా నటించారు. కాగా ఈ చిత్రం గురించి ఆర్పీ.పట్నాయక్ తెలియజేస్తూ, 'ఈ సినిమాలో నేను కృష్ణమూర్తి అనే అధ్యాపకుడి పాత్రలో నటించాను. పవర్ఫుల్ పాత్ర అది. అలాగే సాయికుమార్ కూడా ఓ అద్భుతమైన పాత్రను పోషించారు. పాటలకు మంచి స్పందన రావడంతో ఇటీవల తిరుపతిలో వన్ మిలియన్ క్లిక్స్ డిస్క్ వేడుకను నిర్వహించాం.థియేట్రికల్ ట్రైలర్కు అనూహ్యమైన స్పందన లభించింది. తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రానికి త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిగావించి నవంబర్ 4న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. నిర్మాత జగన్మోహన్ మాట్లాడుతూ, 'ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో అందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది' అని అన్నారు.ఈ చిత్రానికి పాటలు: చైతన్యప్రసాద్, వనమాలి, పులగం చిన్నారాయణ, కెమెరా: ఎస్.జె.సిద్ధార్థ, సహ నిర్మాతలు: ఉమేశ్గౌడ్, బాలసుబ్రహ్మణ్యం.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







