మీడియా నేపథ్యంలో సాగే కథ 'మనలో ఒకడు'

- October 24, 2016 , by Maagulf
మీడియా నేపథ్యంలో సాగే కథ  'మనలో ఒకడు'

కొన్ని యదార్థ ఘటనల ఆధారంగా 'మనలో ఒకడు' కథను రాసుకున్నామని, మీడియా నేపథ్యంలో సాగే కథ ఇదని ప్రధాన పాత్రధారి, దర్శకుడు ఆర్పీ.పట్నాయక్‌ పేర్కొన్నారు. యూనిక్రాఫ్ట్‌ మూవీస్‌ పతాకంపై జగన్‌మోహన్‌ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సన్నద్ధమవుతోంది. 'నువ్వు నేను' ఫేమ్‌ అనితా.హెచ్‌.రెడ్డి కథానాయికగా నటించారు. కాగా ఈ చిత్రం గురించి ఆర్పీ.పట్నాయక్‌ తెలియజేస్తూ, 'ఈ సినిమాలో నేను కృష్ణమూర్తి అనే అధ్యాపకుడి పాత్రలో నటించాను. పవర్‌ఫుల్‌ పాత్ర అది. అలాగే సాయికుమార్‌ కూడా ఓ అద్భుతమైన పాత్రను పోషించారు. పాటలకు మంచి స్పందన రావడంతో ఇటీవల తిరుపతిలో వన్‌ మిలియన్‌ క్లిక్స్‌ డిస్క్‌ వేడుకను నిర్వహించాం.థియేట్రికల్‌ ట్రైలర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. తొలికాపీ సిద్ధమైన ఈ చిత్రానికి త్వరలో సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తిగావించి నవంబర్‌ 4న సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని చెప్పారు. నిర్మాత జగన్‌మోహన్‌ మాట్లాడుతూ, 'ప్రస్తుత సమాజంలో మీడియా పాత్ర ఏంటో అందరికీ తెలుసు. అలాంటి మీడియా నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది' అని అన్నారు.ఈ చిత్రానికి పాటలు: చైతన్యప్రసాద్‌, వనమాలి, పులగం చిన్నారాయణ, కెమెరా: ఎస్‌.జె.సిద్ధార్థ, సహ నిర్మాతలు: ఉమేశ్‌గౌడ్‌, బాలసుబ్రహ్మణ్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com