ఒకరోజు ముందుగానే 'కాష్మోరా' రిలీజ్ !

- October 24, 2016 , by Maagulf
ఒకరోజు ముందుగానే 'కాష్మోరా' రిలీజ్ !

కార్తీ తాజా చిత్రం 'కాష్మోరా'. గోకుల్ దర్శకుడు. నయనతారా, దివ్య శ్రీ కథానాయికలు. ఫస్ట్ లుక్ తోనే కాష్మారో పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ట్రైలర్ తో ఆ అంచనాలు ఆకాశానంటాయి. ఇందులో కార్తీ మూడు పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రలు కూడా దేనికదే వైవిధ్యంగా ఉండనున్నాయట. దాదాపు 60కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు, తమిళ్ లోనూ రిలీజ్ కానుంది.ఈ చిత్రం దీపావఌకి కానుకగా ఈ నెల 29న రిలీజ్ చేయాలని భావించారు. అయితే, ఇప్పుడు అనుకున్నదాని కంటే ఒకరోజు ముందుగానే అంటే ఈ నెల 28న రిలీజ్ చేయనున్నారు. తెలుగు కార్తీకి మంచి మార్కెట్ ఉంది. ఈ యేడాది ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగ్-కార్తీల మల్టీస్టారర్ ఊపిరి సూపర్ హిట్ గా నిలిచింది. కాష్మోరా కూడా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుంటుందనే నమ్మకంతో ఉన్నాడు కార్తీ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com