ప్రార్థించే హక్కు కోసం జరిగిన పోరాటానికి మరో విజయం..
- October 24, 2016
ప్రార్థించే హక్కు కోసం జరిగిన పోరాటానికి మరో విజయం లభించింది. ముంబైలోని హాజీ అలీ దర్గా అంతర్భాగంలోకి మహిళలను అనుమతిస్తామని ట్రస్ట్ పాలకవర్గం తెలిపింది. ఇప్పటి వరకూ మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని తొలగించడానికి అంగీకరించింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా సమ్మతిని తెలిపింది. దర్గాలోకి మహిళలను అనుమతించాలని గతంలో బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. తర్వాత ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. చివరకు దర్గా పాలకవర్గం మహిళల ప్రవేశానికి అంగీకారం తెలపడంతో వివాదం సమసిపోయింది. దర్గాలో ప్రవేశానికి సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ సుదీర్ఘ పోరాటం చేశారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







