ప్రార్థించే హక్కు కోసం జరిగిన పోరాటానికి మరో విజయం..

- October 24, 2016 , by Maagulf
ప్రార్థించే హక్కు కోసం జరిగిన పోరాటానికి మరో విజయం..

ప్రార్థించే హక్కు కోసం జరిగిన పోరాటానికి మరో విజయం లభించింది. ముంబైలోని హాజీ అలీ దర్గా అంతర్భాగంలోకి మహిళలను అనుమతిస్తామని ట్రస్ట్ పాలకవర్గం తెలిపింది. ఇప్పటి వరకూ మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని తొలగించడానికి అంగీకరించింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు రాతపూర్వకంగా సమ్మతిని తెలిపింది. దర్గాలోకి మహిళలను అనుమతించాలని గతంలో బొంబాయి హైకోర్టు తీర్పు చెప్పింది. తర్వాత ఈ వివాదం సుప్రీం కోర్టుకు చేరింది. చివరకు దర్గా పాలకవర్గం మహిళల ప్రవేశానికి అంగీకారం తెలపడంతో వివాదం సమసిపోయింది. దర్గాలో ప్రవేశానికి సామాజిక కార్యకర్త తృప్తి దేశాయ్ సుదీర్ఘ పోరాటం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com