మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతి
- October 24, 2016
మధ్యదరా సముద్రంలోని మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....సోమవారం అక్రమ వలసదారులను గుర్తించేందుకు లిబియాకు బయలుదేరిన విమానం టేకాఫ్ తీసుకునే క్రమంలో రన్వేపై పేలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ఫ్రెంచ్ సిబ్బంది అక్కడిక్కడే మృతిచెందారు. లుక్వా ఎయిర్పోర్ట్లో ఈ ఘటన చోటుచేసుకున్నది. విమానం పేలిన అనంతరం మాల్టా ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









