మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతి

- October 24, 2016 , by Maagulf
మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతి

మధ్యదరా సముద్రంలోని మాల్టా దీవిలో విమానం కూలిన ఘటనలో ఐదుగురు మృతిచెందారు. విమానాశ్రయ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం....సోమవారం అక్రమ వలసదారులను గుర్తించేందుకు లిబియాకు బయలుదేరిన విమానం టేకాఫ్‌ తీసుకునే క్రమంలో రన్‌వేపై పేలిపోయింది. ఈ ఘటనలో విమానంలో ప్రయాణిస్తున్న ఐదుగురు ఫ్రెంచ్‌ సిబ్బంది అక్కడిక్కడే మృతిచెందారు. లుక్వా ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకున్నది. విమానం పేలిన అనంతరం మాల్టా ఎయిర్‌పోర్ట్‌ను తాత్కాలికంగా మూసివేశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్టు అధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com