ఉప్పల్ క్రికెట్ స్టేడియం పైకప్పు కాంట్రాక్ట్ లో దాదాపు 4 కోట్లు ఫ్రాడ్..
- October 25, 2016
ఉప్పల్ క్రికెట్ స్టేడియం పైకప్పునకు సంబంధించి కాంట్రాక్ట్ అప్పగింతలో దాదాపు 4 కోట్లు ఫ్రాడ్ జరిగినట్టు ఏసీబీ నిర్ధారించింది. ఇందులోభాగంగా ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ క్రికెట్ అసిసోయేషన్ అధ్యక్షుడు అర్షద్ అయూబ్తోపాటు మాజీ ఉపాధ్యక్షులు వినోద్, ఎం.వి. శ్రీధర్, కార్యదర్శి చలపతి, కార్యదర్శి కె జాన్ మనోజ్, మాజీ సంయుక్త కార్యదర్శి శేషాద్రి వెంకటేశ్వరన్, కోశాధికారి దేవరాజ్, మాజీ కోశాధికారి నరేశ్శర్మ, ఢిల్లీకి చెందిన కాంట్రాక్ట్ ప్రతినిధులు ఏసీబీ న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.
స్టేడియం పైకప్పు నిర్మాణానికి సంబంధించిన వ్యవహారంపై తక్కువ మొత్తాలకు వేసిన టెండర్లను కాదని, 23 కోట్లకు ఢిల్లీకి చెందిన ఓ కాంట్రాక్ట్ వేసిన టెండర్ను హెచ్సీఏ ఆమోదించింది.
దీనిపై షాలిమార్ క్రికెట్ ఎలెవన్ సంఘం ప్రతినిధి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది ఏసీబీ. దీనిపై దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ని సమర్పించింది ఏసీబీ. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం నిందితులకు సమన్లు జారీ చేయడంతో సోమవారం కోర్టుకు హాజరయ్యారు. తదుపరి విచారణను న్యాయస్థానం వచ్చేనెల 28కి వాయిదా వేసింది.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!







