కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్ (కోటా) ఆవిర్భావం
- October 25, 2016
విదేశాలలోని తెలంగాణ వారిని సమన్వయ పరుస్తూ ఐక్యతా భావం పెంపొందించడానికి ఐక్య రాజ్యసమితిలోని భాగం (యునైటెడ్ నేషన్స్) స్ఫూర్తితో కొనసాగించగలమని వ్యవస్థాపకులు, ప్రవాసి మాసపత్రిక ఎడిటర్, ప్రవాస కార్మిక నాయకులు మంద భీంరెడ్డి తెలిపారు. సోమవారం సోమా జిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడుతూ... దేశాల మధ్య స్నేహసంబంధాలను పెంపొం దిచడానికి ఐక్య రాజ్యసమితి యునైటెడ్ నేషన్స్ ఎంత కృషి చేస్తోందో దానిని స్ఫూర్తిగా తీసుకుని తెలంగాణ ప్రవాసి సంఘాల ఐక్యవేదిక (కోటా) ఏర్పాటు చేయబడిందని తెలిపారు. మానవ హక్కులపై సమష్టి కృషి చేయడానికి అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం దినోత్సవాన్ని అక్టోబర్ 24న జరుపుకోవడం పాటిస్తారు. కోయలిషన్ ఆఫ్ ఓవర్సీస్ తెలంగాణ అసోసియేషన్స్ను అక్టోబర్ నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. భారతీ య సాంస్కృతి సాంప్రదాయాలను, భాష పరిర క్షణ చేయడానికి ఈ వేదిక కృషిచేయనుందన్నారు. విదేశాలలో స్థిరపడిన ఎన్నారైల సంఘాలను సమన్వయ పరుస్తూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలతో సంప్రదింపులు జరుపుకుంటూ మాతృభూమి అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు.ప్రవాసుల అభ్యున్నతి కోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనుసం దానంతో విదేశీ రాయబారుల అనుసందానం తో కార్యకలాపాలు కొనసాగిస్తామని వెల్లడిం చారు. కార్యక్రమంలో టీడీఎప్, టిపి.రెడ్డి, పారి జాత(కెనడా), డాక్టర్. రంగయ్య (ఓమాస్) స్వరూపారెడ్డి, సరిత, సినీదర్శ కుడు సునిల్ కుమార్రెడ్డి, దైవజ్ఞశర్మ హాజరయ్యారు. అనం తరం గోడపత్రికను ఆవిష్కరించారు.

తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







