జెట్ ఎయిర్ వేస్ దీపావళి బొనాంజా...
- October 26, 2016
దీపావళి పండుగ సందర్భంగా విమానయాన సంస్థల దీపావళి బొనాంజా కొనసాగుతోంది. తాజాగా జెట్ ఎయిర్ వేస్ కొత్త తగ్గింపు ధరలను ప్రకటించింది. రూ. 921 (అన్నీ చార్జీలు కలుపుకొని) నుంచి ప్రారంభమయ్యే విమాన టికెట్ ధరలను బుధవారం ప్రకటించింది. ఈ ఆఫర్ నిర్దిష్ట మార్గాలలో ఆరు రోజుల పాటు అమలుచేయనున్నట్టు తెలిపింది.
అక్టోబర్ 25 నుండి 30 వరకు అమలు చేయనున్న ఈ సిక్స్ డేస్ సేల్ ఒకవైపు ధరలకు, డైరెక్ట్ విమానాలకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈ బుకింగ్ తరువాత 15 రోజుల్లోపు జెట్ ఎయిర్వేస్ యొక్క నెట్ వర్క్ లో నిర్దిష్ట దేశీయ రూట్లలో ప్రయాణించాల్సి ఉంటుందని ఒక ప్రకటనలో నేడు తెలియచేసింది.
దీపావళి నేపథ్యంలోఈ ఆఫర్ ప్రకటించామని, బుకింగ్ తర్వాత మాత్రమే 15 రోజుల్లో నవంబర్ 9 న గానీ, లేదా తర్వాత గానీ ప్రయా
ప్రయాణం చేయొచ్చని జెట్ ఎయిర్ వేస్ చీఫ్ కమర్షియల్స్ ఆఫీసర్ జయరాజ్ షణ్ముగం తెలిపారు.
దీంతోపాటు మొబైల్ యాప్ ద్వారా బుక్ చేసుకుంటే మరో రూ. 200 డిస్కౌంట్ కూడా ఇస్తున్నట్టు ప్రకటించారు. 117 విమానాలతో సేవలు అందిస్తున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థ ఫస్ట్ కం ఫస్ట్ సర్వ్ పద్ధతిలోఈఆఫర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







